9 May, 2026 | 1:11 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

తంగళ్ళపల్లిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

20-02-2026 05:47 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన వానరాశి శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ ఉపసర్పంచ్  పెద్దూరి తిరుపతి పరామర్శించారు. నిన్న ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలిపోవడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పెద్దూరి తిరుపతి బాధిత కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించి, వారికి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, డైరెక్టర్ ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, రెడ్డి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు.