8 April, 2026 | 1:59 PM

సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ కార్మికులు

08-04-2026 12:09 PM

వరంగల్, (విజయక్రాంతి): తెలంగాణ ఎన్పీడీసీఎల్‌ సంస్థలో(Telangana NPDCL) పనిచేస్తున్న వేలాదిమంది ఆన్ మ్యాన్, ఆర్టీ సన్, పీస్ రేట్ వర్కర్ విద్యుత్ కార్మికులు(Electricity Workers) తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం 9 గంటల నుండి సమ్మె ప్రారంభించారు. విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగడంతో విద్యుత్ సంస్థ రెగ్యులర్ ఉద్యోగులతో వారి విధులను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులు సమ్మెకు దిగడంతో విద్యుత్ శాఖ లైన్మెన్ సబ్ స్టేషన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.