రాష్ట్ర బాధ్యతలతో సందీప్కు సన్మానం
22-07-2026 06:53 PM
వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆసిఫాబాద్ జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు దుర్గం సందీప్ను బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్లో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టిన సందీప్కు అభినందనలు తెలిపారు. సమాజంలో విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.






