28 March, 2026 | 3:49 PM

తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట

28-03-2026 02:00 PM

వీరమల్లు సరిత దంపతులకు అభినందన తెలిపిన జడ్జి ఎండి గౌస్ పాషా.

తుంగతుర్తి,(విజయక్రాంతి): లోక్‌అదాలత్(Lok Adalat) సాక్షిగా ఓ జంట ఒక్కటైంది. క్షణికావేశంతో కోర్టు మెట్టెక్కిన దంపతులు లోక్‌అదాలత్ సాక్షిగా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని జూనియర్ సివిల్ కోర్టు కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి.గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్‌అదాలత్ లో తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు సరిత దంపతులు 2012లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో వేరువేరుగా ఉంటున్న, వాళ్ళిద్దరూ ఒక్కటి కావడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు.

కేసులు వద్దు సామరస్యంగా పరిష్కారం ముద్దు, అది లోకదాలత్తే సాధ్యపడుతుందని, జడ్జి పేర్కొన్నారు. కక్షి దారులు శనికావేశాన్ని మరిచి, ప్రతి ఒక్కరు ప్రేమ అభిమానంతో జీవించాలని కోరారు. లోక్ అదాలత్ లో విశేషణ స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతి కుమార్ చిరంజీవి, సైదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనపర్తి జ్ఞాన సుందర్ ,కారంగుల వెంకటేశ్వర్లు, పర్వీన్ బేగం, రాజు, వేణు యాదవ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.