16 May, 2026 | 4:12 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్‌ప్రెస్

05-02-2026 11:17 AM

భువనేశ్వర్: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో జఖపురా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు(Chennai Central Express train derails) చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఉదయం 8.51 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని పోలీసులు చెప్పారు.

చెన్నై నుండి పశ్చిమ బెంగాల్‌లోని(Chennai to West Bengal) న్యూ జల్పాయ్‌గురికి వెళ్తున్న రైలుకు చెందిన ఒక ఏసీ కోచ్, రెండు జనరల్ కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారి వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించడానికి భద్రక్ నుండి ఒక సహాయక, పునరుద్ధరణ బృందాన్ని వెంటనే పట్టాలు తప్పిన ప్రదేశానికి పంపినట్లు వెల్లడించారు. ప్రభావిత ప్రయాణికులకు తగిన వసతి కల్పిస్తున్నామని, అయితే పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.