22 June, 2026 | 1:35 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు

27-12-2025 11:54 AM

హైదరాబాద్: ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. నిజామాబాద్(Nizamabad) నగరంలో ఆర్యానగర్, సాయినగర్ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని భారీ చోరీ జరిగింది. ఐదుగురు సభ్యుల ముఠాగా భావిస్తున్న దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎంలను పగలగొట్టి నగదు దోచుకున్నారు.  సాయినగర్ లోని ఎస్‌బిఐ ఏటీఎంలో సుమారు రూ.10 లక్షలు, ఆర్యానగర్‌లోని డీసీబీ ఏటీఎంలో రూ. 27 లక్షల భారీ మొత్తాన్ని దొంగిలించారు. ఏటీఎం లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్ వేడికి కొంత కరెన్సీ కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర రెండు నేర స్థలాలను పరిశీలించారు.