9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అపురూపమైన క్షణం

26-01-2026 01:10 PM

న్యూఢిల్లీ: 27 దేశాల యూరోపియన్ యూనియన్ ఇద్దరు అగ్ర నాయకులైన ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయెన్, సోమవారం కర్తవ్యపథ్‌లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించారు. గత అనేక దశాబ్దాలుగా దేశపు అతిపెద్ద ఉత్సవ కార్యక్రమాన్ని అలంకరించిన కొద్దిమంది ప్రపంచ నాయకుల సరసన చేరారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, విదేశీ దౌత్యవేత్తలు, అనేక మంది ఇతర ప్రముఖులతో కలిసి గ్రాండ్ మిలిటరీ కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన ఇద్దరు అగ్ర నాయకులు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవడం ఇదే మొదటిసారి.