ఎల్ నినో ప్రభావంపై మండల స్థాయి సమీక్ష సమావేశం
22-07-2026 09:37 PM
కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ నినో ప్రభావం,వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై మండల స్థాయి అధికారులతో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో రైతులు, ప్రజలు వ్యవసాయం,పశుపోషణ రంగాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.






