4 May, 2026 | 3:28 PM

Breaking News

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •  

నామినేషన్ కేంద్రాల పరిశీలన

03-12-2025 12:00 AM

కాటారం, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : గ్రామపంచాయతీలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు, ఎంపీఓ వీరస్వామి మంగళవారం పరిశీలించారు. మండలంలోని గ్రామపంచాయతీలలో సర్పంచులకు, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మండలంలో క్లస్టర్లుగా విభజించి, ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

కేంద్రాలలో విద్యుత్తు, మంచినీటి సదుపాయాలను కల్పించారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ మేరకు ఎన్నికల సామాగ్రిని ఆయా క్లస్టర్లకు పంపిణీ చేశారు. సమన్వయ సమావేశంలో మండల తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎంపీఓ వీరస్వామి, ఆర్వోలు, ఏపీవోలు, కార్యదర్శులుపాల్గొన్నారు.