11 March, 2026 | 4:43 PM

Breaking News

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •  

స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులపై సీఎం వ్యాఖ్యలు అర్థరహితం

11-03-2026 01:10 AM

ఆటోనగర్ డంపింగ్  యార్డు వద్ద స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల నిరసన

ఎల్బీనగర్ మార్చి 11 :  హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రతకు స్వచ్ఛ ఆటో కార్మికులు చేస్తున్న సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించకపోగా, ఆటో కార్మికులపై  అర్ధరహిత వ్యాఖ్యలు చేశారని మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ టిప్పర్, ఆటో డ్రైవర్ జేఏసీ చైర్మన్ ఆలకుంట రాము ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సా యంత్రం ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌లో సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును రాంకీ లాంటి పెట్టుబడిదారీ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు. తరతరాలుగా జీవనాధారంగా ఇంటింటికీ చెత్తను సేకరిస్తూ వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తరుణంలో గత ప్రభుత్వంలో స్వచ్ఛ ఆటో లను కార్మికులకు అందజేసిందన్నారు.

దాదాపు పది సంవత్సరాలకు పైగా స్వచ్ఛ ఆటో లతో ఇంటింటికి చెత్తను సేకరిస్తున్న కార్మికులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తమకు తీవ్ర ఆవేదనను గురిచేసాయని, ఐదువేల ఆటోలను ఎక్కడ పంపిణీ చేశారో, ప్రభుత్వం వెంటనే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మ న్ పి.కృష్ణ, కార్మికులు బాలస్వామి, సంతోష్, భాషా, సంతోష్, రాజేశ్, రామకృష్ణ, నర్సిం హ, సాలయ్య తదితరులు పాల్గొన్నారు.