6 May, 2026 | 10:05 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

సర్పంచ్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం

06-03-2026 03:43 PM

వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బంబార గ్రామపంచాయతీ కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బంబార గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ స్వయంగా పర్యవేక్షిస్తూ పారిశుద్ధ్య పనులు చేయించారు.

గ్రామం శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవ హరించాలని సర్పంచ్ బెండరే కృష్ణాజీ తెలిపారు. గ్రామా భివృద్ధికి పరిశుభ్రత ఎంతో అవసరమని,ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నా రు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, గ్రామ పంచా యతీ కార్యదర్శి ధర్మయ్య, పంచాయతీ సిబ్బంది, సాఫై కార్మికులు తదితరులు పాల్గొన్నారు.