calender_icon.png 20 January, 2026 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Business

article_33818021.webp
ముంబై గృహ మార్కెట్‌లో ఎంబసీ డెవలప్‌మెంట్స్ పెట్టుబడులు

20-01-2026

బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో తమ వ్యాపారాన్ని విస్తరించే వ్యూహంలో భాగంగా రియల్టీ సంస్థ ఎంబసీ డెవలప్‌మెంట్స్ మంగళవారం ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది.

continue reading

article_58108429.webp
కడపలో ప్యూర్ ఈవీ ప్రారంభం

20-01-2026

కడప, జనవరి 19: భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారులలో ఒకటైన ప్యూర్ సంస్థ కడపలో తన సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్యూర్ మిషన్‌లో ఈ వ్యూహాత్మక విస్తరణ ఒక ముఖ్యమైన ముందడుగుగా పేర్కొంది. వైఎస్ఆర్ జిల్లా విజయదుర్గ ఆఫీసర్స్ కాలనీలో ప్యూర్ ఈవీకి చెందిన సమగ్రమైన ఎలక్ట్రిక్ టూ-వీలర్ల శ్రేణిని ప్రదర్శించనున్నారు. దీనిలో అత్యంత ఆదరణ పొందిన ఈ ప్లూటో 7G మాక్స్, ఈట్రిస్ట్ ఎక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి. కడప ప్రజలకు అసమానమైన ఎలక్ట్రిక్ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్యూర్ ఈవీ తెలిపింది.

continue reading

article_19220492.webp
వెండి @ 3,18,000

20-01-2026

న్యూఢిల్లీ, జనవరి 19: దేశవ్యాప్తంగా వెండి ధరలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఆదివారం కిలో వెండి ధర రూ.3,10,000 పలుకగా, సోమవారానికి ఆ ధర రూ.3,18,000కు చేరుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా వెండి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారు వెండి కొనుగోలు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కేవలం వెండికే కాకుండా అదనంగా జీఎస్టీ, తయారీ చార్జీలు చెల్లించాల్సి రావడం వారి స్తోమతకు మించినదిగా పరిణమించింది. అలాగే పసిడి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.

continue reading

article_31169823.webp
పై పై కి వెండి ధరలు

15-01-2026

న్యూఢిల్లీ, జనవరి ౧౪: వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి రూ.2,88,300 పలుకుతున్నది. తద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం కంటే ఒక్క రోజులోనే రూ.12,803 మేర ధర పెరగడం గమనార్హం. గడిచిన నాలుగు రోజుల్లోనే వెండి ధర ఏకంగా రూ.35 వేలకు పెరిగింది. మరోవైపు బంగారం తులం ధర రూ.1.43 లక్షల వద్ద ట్రేడవుతున్నది. మునుపెన్నడూ లేని గరిష్ఠ స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,600 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 90 డాలర్ల ఎగువన ట్రేడ్ అవ్వడం దేశీయ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.

continue reading

article_22864516.webp
తప్పును అంగీకరించిన ఎక్స్.. 600 ఖాతాలు తొలగింపు

11-01-2026

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తన తప్పును అంగీకరించిందని, భారత చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువగా దాని గ్రోక్ AI సృష్టించిందని, ఎక్స్ దాదాపు 3,500 కంటెంట్ భాగాలను బ్లాక్ చేసి భారతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన 600కి పైగా ఖాతాలను తొలగించింది.

continue reading

article_48741944.webp
కేర్ హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స

11-01-2026

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ వైద్యులు నలుగురు రోగులకు అరుదైన లిం బ్ సాల్వేజ్ చికిత్స చేసి చేతులు, కాళ్లను కాపాడారు. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ వైద్యుడు డా అజయ్ కుమార్ పరుచూరి నాయకత్వంలో, అత్యంత క్లిష్టమైన పరిస్థితు ల్లో ఉన్న నలుగురి చేతులు, కాళ్లను ఇలిజారోవ్ లింబ్ రీకన్స్ట్రక్షన్ విధానంతో విజయవంతంగా కాపాడారు. హైదరాబాద్కు చెంది న 33 ఏళ్ల ఎన్ నీలిమా దేవి రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన ఓపెన్ ఫ్రాక్చ ర్కు గురయ్యారు.

continue reading