04-01-2026
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్స్ వైద్యులు 56 ఏళ్ల పురుష రోగిలో పెద్ద రెక్టా ప్రొలాప్స్ (మల ద్వారంలో పెరిగిన కణితి) తొలగించడానికి ఎండోస్కోపిక్ సబ్మ్యూకోసల్డిసెక్షన్ (ఈఎస్డీ) అనే అధునాతన కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. దీనివల్ల రోగికి పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా పోయింది. వేగంగా కోలుకోవడానికి సహాయపడింది. మలంలో రక్తం పడటంతో సదరు రోగి చికిత్స కోసం వచ్చారు. కణితిపరిమాణం పెద్దదిగా ఉండటంతో, మొదట శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాలని భావించారు.
04-01-2026
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు తదితర రుమటాలజీ సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రకాల చికిత్సా పద్ధతులు వస్తున్నాయని, వీటి గురించి రుమటాలజిస్టులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోగులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించడం ముదావహమని కిమ్స్ ఆస్పత్రుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 (సీఆర్సీ 2026) సదస్సును ఆయన ప్రారంభించారు.
02-01-2026
న్యూఢిల్లీ, జనవరి1 : పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసా లాపై సెస్సు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వర్తించ నుందని తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం.. బీడీలపై 18 శాతం కేంద్రం జీఎస్టీ విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ పెంపు, పొగాకుతో పాటు సం బంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసిం ది. ఇవన్నీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలవుతాయి.
02-01-2026
న్యూఢిల్లీ, జనవరి 1 : దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని సూచిస్తూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 డిసెంబర్ నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,74,550 కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2024 డిసెంబరులో నమోదైన రూ.1,64,556 కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం అధికం కావడం గమనార్హం. పండుగల సీజన్ తర్వాత కూడా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
02-01-2026
న్యూఢిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరంలో దేశీయ హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. అయితే, ఈ పెరుగుదల గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్కు వర్తించదు. గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.111 పెరిగి రూ.1,691.50కి చేరుకుంది.
01-01-2026
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఆహారం మింగలేక, నీళ్లు కూడా తాగలేని స్థితికి చేరుకుని రెండేళ్లకు పైగా తీవ్ర నరకయాతన అనుభవించిన రోగికి మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. అరుదైన అన్నవాహిక సమస్యతో అకాలేషియా కార్డియా వ్యాధితో 25 కిలోల బరువు తగ్గిన 46 ఏళ్ల ఒస్మాన్ బాబికర్ ఎల్హాజ్కు విజయవంతంగా ఎటువంటి కోతలు, కుట్లు లేని అత్యాధునిక ఎండోస్కోపిక్ చికిత్స ద్వారా పూర్తిస్థాయి ఉపశమనం కలిగించారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఒస్మాన్ బాబికర్ తీవ్రమైన మింగుడు సమస్యతో బాధపడుతున్నారు.