11-01-2026
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తన తప్పును అంగీకరించిందని, భారత చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువగా దాని గ్రోక్ AI సృష్టించిందని, ఎక్స్ దాదాపు 3,500 కంటెంట్ భాగాలను బ్లాక్ చేసి భారతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన 600కి పైగా ఖాతాలను తొలగించింది.
11-01-2026
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ వైద్యులు నలుగురు రోగులకు అరుదైన లిం బ్ సాల్వేజ్ చికిత్స చేసి చేతులు, కాళ్లను కాపాడారు. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ వైద్యుడు డా అజయ్ కుమార్ పరుచూరి నాయకత్వంలో, అత్యంత క్లిష్టమైన పరిస్థితు ల్లో ఉన్న నలుగురి చేతులు, కాళ్లను ఇలిజారోవ్ లింబ్ రీకన్స్ట్రక్షన్ విధానంతో విజయవంతంగా కాపాడారు. హైదరాబాద్కు చెంది న 33 ఏళ్ల ఎన్ నీలిమా దేవి రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన ఓపెన్ ఫ్రాక్చ ర్కు గురయ్యారు.
11-01-2026
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): అంతర్జాతీయ చాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షుడు, లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రదానం చేసిన భారత్ గౌరవ్ అవార్డు గ్రహీత డా అజయ్ కుమార్ అగర్వాల్.. హైదరాబాద్లో జనవరి 10, 11 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఏషియన్ థలసేమియా కాన్క్లేవ్ హాజరయ్యారు. థలసేమియా, ఇతర రక్త సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సహాయార్థం రూ.లక్ష విలువైన చెక్కును తెలంగాణ థలసేమియా, సికిల్ సొసైటీ అధ్యక్షుడు డా. చంద్రకాంత్ అగర్వాల్కు అందజేశారు.
11-01-2026
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): హృదయ వైద్య రంగంలో తెలంగాణను జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఫెలోస్ ఇండియా 2026 అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జనవరి 9 నుంచి 11 వరకు నోవోటెల్ హైదరాబాదు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ మూడు రోజుల అకడమిక్ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖ హృదయ వైద్య నిపుణులు హాజరయ్యారు.
11-01-2026
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ లోని తన ల్యాబొరేటరీలో అత్యాధునిక టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్ (టీఎల్ఏ) వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో తొలిసారి అమలు చేసిన సాంకేతికతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు పాల్గొన్నారు.
11-01-2026
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): వెన్నెముక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, సర్జరీలకు భయపడాల్సిన పనిలేదని మెడికవర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పున్ సర్జరీలపై వివరించారు. నడుం నొప్పి వచ్చిన ప్రారంభంలోనే స్పున్ సర్జరీ చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గతంలో మాదిరిగా స్పున్ ఓపెన్ సర్జరీలు లేవ ని, ఉత్తర తెలంగాణలోనే మొదటి సారిగా మెడికవర్లో అత్యాధునిక ఎండోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి రావడంతో కీ హోల్తో తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తవుతుందన్నారు.