calender_icon.png 23 November, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Business

article_77244802.webp
ఏడాదిలో 50 వేల ఎంజీ విండ్సర్ కార్ల విక్రయం

19-11-2025

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అరుదైన మైలురాయి అందుకుంది. ఏడాదిలోపే 50 వేల ఎంజీ విండర్స్ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. తద్వారా రికార్డు సమయంలో 50,000 అమ్మకాల మార్కును దాటిన మొదటి ఈవీ కంపెనీగా అవతరించింది. ఈవీ సెక్టార్లలో విండర్స్ కార్లకు ఆరంభం నుంచీ మంచి డిమాండ్ ఏర్పడిందని జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రతీ నెలకూ డిమాండ్ పెరగడం ప్రస్తుత మైలురాయికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఎంజీ విండ్సర్ యొక్క వినూత్న డిజైన్, అత్యుత్తమ పనితీరు కస్టమర్లను అద్భుతంగా ఆకట్టుకుందని తెలిపారు.

continue reading

article_27985926.webp
భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

19-11-2025

హైదరాబాద్, నవంబర్ 18: పసిడి, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు తగ్గాయి.దేశీయ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగిరావడంతో దేశీయంగానూ పసిడి ధరలు బాగా తగ్గాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు.

continue reading

article_88041625.webp
క్వాలిజీల్, ఎవరెస్ట్ గ్రూప్ ఏఐ ఆధారిత వైట్ పేపర్ ఆవిష్కరణ

18-11-2025

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన క్వాలిజీల్ దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. పరిశోధన మరియు సలహా సంస్థ ఎవరెస్ట్ గ్రూప్‌తో కలిసి AI-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్ లో మైలురాయిగా చెప్పుకునేలా వైట్‌పేపర్‌ను విడుదల చేసింది. ఆధునిక సాఫ్ట్‌వేర్ డెలివరీ పర్యావరణ వ్యవస్థలలో నాణ్యమైన సంక్లిష్టతలలో మార్పులను ఈ వైట్‌పేపర్ పరిశీలిస్తుంది, లెగసీ సిస్టమ్‌లు, క్లౌడ్-నేటివ్ అప్లికేషన్‌లు, ప్లాట్‌ఫారమ్-లీడ్ క్వాలిటీ ఇంజినీరింగ్ అవసరాన్ని పెంచే ఏఐ ఆధారిత ఆర్కిటెక్చర్‌లను ఇది కలిగి ఉంటుంది. ఏఐ ప్రస్తుతం ప్రాథమికంగా ఎంటర్‌ప్రైజ్ నాణ్యత నిర్వచనాన్ని మార్చిందనీ ఎవరెస్ట్ గ్రూప్ ప్రాక్టీస్ డైరెక్టర్ అంకిత్ నాథ్ చెప్పారు.

continue reading

article_63162548.webp
ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు

19-11-2025

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దని, జాగ్రత్తలు పాటించక మగవారిలో అనా రోగ్య సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ దీపక్ రాగూరి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏఐఎన్యూ ఆస్పత్రి అన్నారు. బుధవా రం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సామాజిక పరిస్థితుల కారణంగా చాలామంది పురు షులు సీరియస్ అయ్యేవరకు తమ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోరు.

continue reading

article_40178643.webp
గచ్చిబౌలిలో ‘బిర్లా ఫెర్టిలిటీ, ఐవీఎఫ్’

19-11-2025

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): బహుళ బిలియన్ డాలర్ల సీకేఏ బిర్లా గ్రూప్‌లో భాగమైన బిర్లా ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ నూతన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో మంగళవారం ప్రారంభించారు. బిర్లా ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘బిర్లా ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ ప్రపం చ క్లినికల్ ప్రమాణాలు, అధునాతన సాంకేతికత, పూర్తి ఖర్చు పారదర్శకతపై నిర్మించిన సంరక్షణ నమూనాను తీసుకువస్తుంది.

continue reading

article_51380590.webp
యశోద హాస్పిటల్స్ సరికొత్త చరిత్ర

19-11-2025

హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): ప్రపంచ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చరిత్ర లో యశోద హాస్పిటల్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ (విషపూరితమైన కలుపు మందు) తాగిన అతి పిన్న వయస్కుడికి ప్రపంచంలోనే మొదటిసారిగా విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసి సరికొత్త చరిత్ర నృష్టించింది. పెద్దపల్లిజిల్లా ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీష్‌కుమార్, సుమలతల కుమారుడు ఆరవ తరగతి చదువుతు న్న 12 ఏళ్ల అనురాగ్ సందీప్ ప్రమాదవశా త్తూ పారాక్వాట్ పాయిజన్ తాగి ప్రాణాపా యస్థితికి గురయ్యాడు.

continue reading