23-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీ రింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) (జీఐఈటీ)లో ఏఐసీటీఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కింద డిసెంబర్ 22, 23 తేదీల్లో ఆటోమేషన్, కమ్యూనికేషన్, కంప్యూటింగ్ (ఎన్ సీఏఏసీసీ-2025) అడ్వాన్స్మెంట్స్పై నేషనల్ కాన్ఫరెన్సు విజయవంతంగా నిర్వహిం చింది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభా గం ఎన్బీఏ అక్రిడిటేషన్, నాక్ ఏ+ గ్రేడ్, యూజీసీ అటానమస్ హోదాతో సహా దాని బలమైన విద్యా ప్రమాణాల ఆధారంగా ఈ సంస్థ ఈ ప్రతిష్టాత్మక పథకానికి ఎంపిక చేయబడింది.
23-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ చందానగర్లో ఐస్బ ర్గ్ ఆర్గానిక్ కొత్త స్టోర్ను సినీ నటుడు అలీ ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి, ఏకైక ఆర్గానిక్ క్రీమరీగా ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమం లో కొత్త ఔట్లెట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ సుహాస్తో పా టు పలువురు పాల్గొన్నారు.
22-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): ప్రపంచంలో, దేశంలో ఏ మూల నైనా వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తే వాటిని వెంటనే అందిపుచ్చుకోవడం తమ ఆస్పత్రి లక్ష్యమని కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. నగరంలోని నోవోటెల్ హోటల్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా స్పైన్ రోబోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్సల్లో అత్యంత కచ్చితత్వం అవసరం అవుతుంటుందని, ఈ విషయంలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రోబోను ఎవరూ వాడలేదని, తొలిసారిగా తాము దీన్ని ఆవిష్కరించి, వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఓ సరికొత్త శకానికి నాంది పలికా మని డాక్టర్ భాస్కరరావు చెప్పారు.
21-12-2025
ముద్దులొలికే చిన్నారుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పెగెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ది లుక్స్ మోడలింగ్ , యాక్టింగ్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతికి చెందిన చిన్నారులు పాల్గొంటున్నారు. విశ్వాసం, వ్యక్తిత్వ అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రోత్సహించడానికి దీనిని నిర్వహిస్తున్నారు.
22-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): హైదర్షాకోట్ లోని ఎస్ఎంపీ ఇంట ర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రోబోటిక్స్ ఎక్స్పో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్పోను పాఠశాల చైర్మన్ ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. చిన్న వయసు నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై ఆస క్తి పెంచుకొని, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు వెతకాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు తమ ప్రాజెక్టులను సందర్శకులకు స్వయంగా వివరించడం ద్వారా తమ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. 5వ తరగతి విద్యార్థులు జయసూర్య, నమన్శర్మ తమ రోబో లైట్ 2.0 మోడల్ను ప్రదర్శిస్తూ, రోబోటిక్స్, ఆటోమేషన్ ప్రాథమిక అంశాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.
21-12-2025
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన ఏఎస్బీఎల్ తమ ఉద్యోగులు, కస్టమర్ల కోసం ఫ్యామిలీ డే 2025ను ఘనంగా నిర్వహించింది. కమ్యూనిటీ, కనెక్షన్, భాగస్వామ్య విజయానికి అంకితమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన వ్యాఖ్యానంతో ఈ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కు మరింత జోష్ తెచ్చారు. కస్టమర్లతో అనుబంధం లావాదేవీలకే పరిమితం కాకుండా అంతకుమించిన రిలేషన్ తో కొనసాగాలన్న ఉద్దేశంతోనే దీనిని నిర్వహించినట్టు ఏఎస్బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కొరుపోలు చెప్పారు.