24-10-2025
హైదరాబాద్, అక్టోబర్ 23(విజయక్రాం తి): అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా బుధవారం దొగొచ్చిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారంతో పోలిస్తే రూ.2,600పైగా పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,28,300 పలికింది.
24-10-2025
అశ్వాపురం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మిట్టగూడెం లోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గురు వారం గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ పద్ధతి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం ప్రాథమిక వైద్యుడు డాక్టర్ శివకుమార్ విద్యార్థులకు సిపిఆర్ చేయవలసిన విధానాన్ని ప్రాయోగికంగా చూపించారు.
23-10-2025
న్యూఢిల్లీ, అక్టోబర్ 22 : ఇటీవల సరికొత్త రికార్డులు సృష్టిస్తూ పెరిగిన బంగారం ధర బుధవారం దిగొచ్చింది. దీపావళికి ముందు నుంచి ధగధగ మండుతూ ఆకాశానంటిన పసిడి ధర ఒక్కరోజే తులంపై రూ.9 వేల వరకు తగ్గింది. బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,250కి పడిపోయింది.22క్యారెట్ల ధర రూ.1,14,843 ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.13వేల వరకు తగ్గింది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు 28 వేలకు పైగా తగ్గింది.
23-10-2025
క్లిష్టమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లో విశ్వాసాన్ని, పారదర్శకతను నెలకొల్పుతూ, రియల్టర్ ఆక్సిజన్ (Realtor Oxygen) వ్యవస్థాపకుడు, సీఈవో అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు విజయక్రాంతి దిన పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. రియల్ఎస్టేట్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం, శిక్షణతో రాటుదేలిన డాక్టర్ నంది రామేశ్వరరావు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నమ్మకం, నైపుణ్యాన్ని పెంచే దిశగా పనిచేస్తున్నారు. ‘నిజాయితీ, పారదర్శకత విషయంలో రాజీ పడేది లేదు’ అనేది ఆయన పనితీరుకు నిదర్శనం.
23-10-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తీవ్రమైన న్యుమోనియాతో పోరాడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 40 ఏళ్ల వ్యక్తి, మెడికవర్ హాస్పిటల్స్లోని నిపుణుల బృందం అందించిన చికిత్స కారణంగా అద్భుతంగా కోలుకున్నారు. వేరే ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నప్పటికీ, అతని ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదక రంగా పడిపోయాయి, ఊపిరితిత్తులు పూర్తి గా పనిచేయడం ఆగిపోయాయి.
22-10-2025
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ఇండియాపై కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం బుధవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన వీరేష్ అనే యువకుడు ఇటీవల అమెజాన్లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టాడు. కానీ అమెజాన్ సంస్థ ఐఫోన్ 15ప్లస్కు బదులు ఐక్యూ ఫోన్ డెలవరీ చేసింది. వెంటనే బాధితుడు అమెజాన్ కస్టమర్ కేర్ను సంప్రదించాడు.