21-12-2025
ముద్దులొలికే చిన్నారుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పెగెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ది లుక్స్ మోడలింగ్ , యాక్టింగ్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతికి చెందిన చిన్నారులు పాల్గొంటున్నారు. విశ్వాసం, వ్యక్తిత్వ అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రోత్సహించడానికి దీనిని నిర్వహిస్తున్నారు.
22-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): హైదర్షాకోట్ లోని ఎస్ఎంపీ ఇంట ర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రోబోటిక్స్ ఎక్స్పో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్పోను పాఠశాల చైర్మన్ ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. చిన్న వయసు నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై ఆస క్తి పెంచుకొని, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు వెతకాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు తమ ప్రాజెక్టులను సందర్శకులకు స్వయంగా వివరించడం ద్వారా తమ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. 5వ తరగతి విద్యార్థులు జయసూర్య, నమన్శర్మ తమ రోబో లైట్ 2.0 మోడల్ను ప్రదర్శిస్తూ, రోబోటిక్స్, ఆటోమేషన్ ప్రాథమిక అంశాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.
21-12-2025
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన ఏఎస్బీఎల్ తమ ఉద్యోగులు, కస్టమర్ల కోసం ఫ్యామిలీ డే 2025ను ఘనంగా నిర్వహించింది. కమ్యూనిటీ, కనెక్షన్, భాగస్వామ్య విజయానికి అంకితమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన వ్యాఖ్యానంతో ఈ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కు మరింత జోష్ తెచ్చారు. కస్టమర్లతో అనుబంధం లావాదేవీలకే పరిమితం కాకుండా అంతకుమించిన రిలేషన్ తో కొనసాగాలన్న ఉద్దేశంతోనే దీనిని నిర్వహించినట్టు ఏఎస్బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కొరుపోలు చెప్పారు.
21-12-2025
టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్నుప్రారంభించారు. అక్కడ చీరల కలెక్షన్లు చూసి మురిసిపోయారు. ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు ఈ శారీస్ కలెక్షన్లే అంటూ వ్యాఖ్యానించారు. భారతీయ హస్తకళలు , చేనేత చీరల ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని, ఇది అందరికీ గర్వకారణమని చెప్పుకొచ్చారు.
21-12-2025
హైదరాబాద్కు చెందిన చందుభాయ్ ది డైమండ్ స్టోర్, ప్రాచీన భారతీయ రాజ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఒక అద్భుతమైన ఆభరణాల సృష్టిని ఆవిష్కరించింది. చారిత్రాత్మక ఏడు వారాల నగలకు ఆధునిక రూపంతో వజ్రాలతో సరికొత్తగా రూపొందించింది. ఈ ఏడు భాగాల వజ్రాలు , నవరత్నాల కళాఖండాన్ని 22,000 సహజ వజ్రాలు మరియు అసలైన నవరత్న రాళ్లతో తయారు చేశారు. ఇది వివాహ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, డిజైన్ వర్గాలలో ప్రశంసలను అందుకుంది.
21-12-2025
మోయినాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) భవిష్యత్తులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితంపై విస్తృత ప్రభావం చూపబోతుందని, ఆ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని కోనేరు లక్ష్మణ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు లక్ష్మణ్ హవీష్ అన్నారు.