16-12-2025
హైదరాబాద్: స్వదేశీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా గుర్తింపు పొందిన సంస్థ బ్రిక్వర్క్ తెలంగాణ జీడీపీపై కీలక అంచనా వేసింది. 2025 నుంచి 2034 మధ్య కాలంలో సగటున సంవత్సరానికి సుమారు 12–13 శాతం నిజమైన జిడిపి వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. పారిశ్రామిక రంగం, సేవల రంగం మరియు మౌలిక సదుపాయాల్లో కొనసాగుతున్న పెట్టుబడుల వల్ల ఈ బలమైన వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. అయితే, ఈ వృద్ధి గమనాన్ని నిలబెట్టుకోవాలంటే నిరంతర విధాన మద్దతు, స్థిరమైన మూలధన ప్రవాహాలు మరియు బాహ్య-దేశీయ ప్రమాదాలను ఎదుర్కొనే దిశగా సకాలంలో నిర్మాణాత్మక సంస్కరణలు కీలకమని అభిప్రాయపడింది.
16-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మదీనాగూడలోని సిద్ధార్థ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వెల్ కిన్స్ కార్డియాక్ సెంటర్’ను ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ ఎస్. గురు ప్రసాద్తో పాటు డాక్టర్ సిద్ధార్థరెడ్డి ప్రారంభించారు. ఈ కార్డియాక్ సెంటర్ ప్రారంభంతో శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనాగూడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులోకి రానుంది.
16-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రెనోవా హాస్పిటల్స్, ఆర్థోపెడిక్స్ చికిత్సలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. మిడ్ లెవెల్ హాస్పిటల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా, అత్యంత అధునాతనమైన కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను సనత్ నగర్, జెక్ కాలనీలోని తమ ఆసుపత్రిలో సోమవారం ప్రారంభించింది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డితోపాటు గౌరవ అతిథులుగా పింగిలి నరేష్రెడ్డి, ఏసీపీ, బాలానగర్ డివిజన్, కె. లక్ష్మీ బాల్రెడ్డి, కార్పొరేటర్, సనత్నగర్ డివిజన్, కె. శ్రీనివాసులు, సీఐ, సనత్నగర్, ఎండీ అబ్దుల్ హయ్యూమ్, ఎస్సై, సనత్నగర్, లింగంపల్లి నర్సింగ రావు, సీనియర్ నాయకులు, బీజేపీ, చెక్ కాలనీ కలిసి ప్రారంభించారు.
15-12-2025
జేఎస్ డబ్ల్యూ మోటార్ ఇండియా ఆల్-న్యూ ఎంజీ హెక్టర్ను విడుదల చేసింది. బంజారాహిల్స్ లోని ఎంజీ మోటార్స్ షోరూంలో బిగ్ బాస్ సీజన్ -2 విజేత కౌశల్ కొత్త మోడల్ ను ఆవిష్కరించారు. ఇది ఎస్ యూవీ విభాగంలో బోల్డ్ డిజైన్, సాటిలేని సౌకర్యం, మార్గదర్శక సాంకేతికతతో రూపొందించినట్టు ఎంజీ మోటార్స్ ఇండియా తెలిపింది. ఈ ఆల్-న్యూ హెక్టర్ అద్భుతమైన లక్షణాలను కలిగి ఉందనీ, సరికొత్త ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్, కొత్త గ్రిల్ డిజైన్, వినూత్నమైన అల్లాయ్ వీల్స్ తో ఆకట్టుకుంటుందని వెల్లడించారు.
15-12-2025
వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 26 పైసలు పడిపోయి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 90.64కి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. 2025లో 5.5 శాతం పడిపోయిందని, 2025 సంవత్సరంలో రూపాయి అత్యంత పేలవమైన పనితీరు కనబరిచిన ఆసియా కరెన్సీగా నిలిచింది.
15-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో మధుమే హ బాధితులు ఎక్కువగా ఉన్నారని, వీరి కి కాళ్లలో పుళ్లు పడినా నొప్పి తెలియకపోవడంతో అవి తీవ్రమై చివరకు కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి నలుగురు మధుమే హ బాధితుల్లో ఒకరికి ఈ తరహా సమస్య వస్తోందన్నారు. ముందుగా గుర్తించగలిగితే వాస్క్యులర్ చికిత్సలతో కాళ్ల ను కాపాడుకునే అవకా శం ఉంటుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొల్లినేని తెలిపారు.