దర్శనానికి ఖైరతాబాద్‌ బడా గణేష్ రెడీ

12-09-2026 | 04:12pm

హైదరాబాద్: ఈ ఏడాది గణేష్ చతుర్థి(Vinayaka Chavithi) సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం(Khairatabad Ganesh Idol Ready) 69 అడుగుల ఎత్తుతో భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ రాజు కుమార్ తెలిపారు. ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) విగ్రహం తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఆదివారం నాటికి భక్తుల దర్శనానికి సిద్ధమవుతుందని వెల్లడించారు."మేము దశలవారీగా ఆధారపు కర్రలను తొలగిస్తాము, దాంతో విగ్రహ తయారీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ఏడాది విగ్రహానికి 'పంచముఖ సంకటహర గణపతి' అని పేరు పెట్టారు.

పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది కళాకారులు కలిసి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించారు. మొదటి రోజు పూజ కోసం తెలంగాణ గవర్నర్‌ను(Governor of Telangana) ఉత్సవ కమిటీ ఆహ్వానించింది." అని రాజు కుమార్ తెలిపారు. రాజు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం నాడు ఉత్సవ కమిటీ 'ఆగమన్' కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఇందులో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేశుడు తెలంగాణలోని అత్యంత ఎత్తైన గణేష్  విగ్రహాలలో ఒకటన్న విషయం తెలిసిందే. గణేశ చతుర్థి ఉత్సవాల సమయంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోందని గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు