7 August, 2026 | 4:59 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

07-08-2026 03:56 PM

వాంకిడి,(విజయక్రాంతి): పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం వాంకిడి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నటరాజ్‌తో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.