మంచరామిలో సామాజిక తనిఖీ నివేదిక సమర్పణ
04-09-2026 | 08:29pm
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ 17వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికను గ్రామసభలో సమర్పించారు. చేపట్టిన పనులు, వాటి అమలు తీరుపై సామాజిక తనిఖీ నివేదికను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల సమక్షంలో నివేదికను సమర్పించి, సంబంధిత అంశాలపై చర్చించారుమసభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల సమక్షంలో నివేదికను సమర్పించి, సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ ఉప్పు లక్ష్మీ, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, సామాజిక తనిఖీ డీఆర్పీ, ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






