5 September, 2026 | 12:10 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన భువనగిరి ఎంపీ చామల

04-09-2026 | 11:02pm

ఆదిభట్ల,(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్మటి వెంకట్ రెడ్డి (EVR) తమ్ముడు నరేందర్ రెడ్డి, ప్రణతి రెడ్డిల వివాహ మహోత్సవం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని పీ.యస్.వై. కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) హాజరై నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం నూతన దంపతులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎల్మటి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.