బదిలీపై వెళ్తున్నఎక్సైజ్ సీఐ రమ్యారెడ్డికి వీడ్కోలు
12-09-2026 | 01:29pm
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): భూపాలపల్లి ఎక్సైజ్ సీఐ రమ్యారెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రమ్యారెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ కార్యక్రమంలో నేరేడుపల్లి సర్పంచ్ శ్రీపతి తిరుపతి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, మల్లంపల్లి సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి సదయ్య గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.