బ్యాంక్ ఆఫ్ బరోడాకు ‘రాజభాషా కీర్తి పురస్కార్’

19-09-2026 | 05:05am
  1. వరుసగా ఐదో ఏడాది లభ్యం
  2. అధికారిక భాషా అమలులో నిరంతర కృషికి గుర్తింపు

ముంబై, సెప్టెంబర్ 18: అధికారిక భాషా(Official language) (రాజభాష) అమలులో అసాధారణ పనితీరుకు గుర్తింపుగా, భారత ప్రభుత్వ(Government of India) ‘రాజభాషా కీర్తి పురస్కార్’ పథకం('Rajabhasha Keerthi Puraskar' Scheme) కింద 800 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న జాతీయకృత బ్యాంకులు(Nationalized banks)/ఆర్థిక సంస్థల ప్రధాన కార్యాలయాల కేటగిరీలో 2025--26 సంవత్సరానికి గాను బ్యాంక్ ఆఫ్ బరోడా రెండవ బహుమతిని గెలుచుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును బ్యాంక్ వరుసగా ఐదో ఏడాది దక్కించుకోవడం విశేషం.

నవీ ముంబై(Mumbai)లోని సీఐడీసీఓ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 14న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధ్యక్షతన జరిగిన ‘హిందీ దివస్ 2026’, ‘ఆరవ అఖిల భారత అధికార భాషా సదస్సు’లో ఈ అవార్డును ప్రధానం చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు నిత్యానంద్ రాయ్, బండి సంజయ్ కుమార్‌(Bandi Sanjay Kumar)ల చేతుల మీదుగా భారత ప్రభుత్వ అధికార భాషా కార్యదర్శి అన్షులీ ఆర్య,ఇతర ప్రముఖుల సమక్షంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ డాక్టర్ దేబదత్త చంద్ ఈ అవార్డును అందుకున్నారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారులలో ముంబై జోన్ చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ మధుర్ కుమార్, అధికార భాష, పార్లమెంటరీ కమిటీల విభాగాధిపతి డాక్టర్ పునీత్ కుమార్ మిశ్రా, నవీ ముంబై రీజియన్ రీజినల్ హెడ్ మనీష్ కుమార్ సిన్హాలతో పాటు బ్యాంక్‌కు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు