హౌస్ అరెస్టులు రేవంత్ సర్కార్ పిరికిపంద చర్య
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గ చర్య
హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి
కూసుమంచి, విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారాపరాజు రామచందర్ రావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు పిలుపు మేరకు సోమవారం విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్ పదిహేను వేల కోట్ల రూపాయల విడుదల కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం కు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గం ఐన చర్య. హౌస్ అరెస్ట్ లతో భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకుని ఫీజులు బకాయి - బీజేపీ లడాయి కార్యక్రమం చేపట్టకుండా కుట్ర పూరితంగా పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్య.
ఎంతోమంది విద్యార్దులు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన వారి సంబంధిత కళాశాలలో సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి వలన ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు కూడా విద్యార్థుల పక్షపాతిగా ఉంటూ ఈరోజు అరెస్టులు చేసినప్పటికీ ఎటువంటి లేకుండా కచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కొరకు విద్యార్థులు తరఫున పోరాటం చేస్తాము అని తెలియజేస్తున్నాము.
