భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
ఢిల్లీ వేదికగా రేపు, ఎల్లుండి 18వ బ్రిక్స్ సదస్సు
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Putin), బ్రిక్స్ సదస్సులో(18th BRICS Summit) పాల్గొనేందుకు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని(Prime Minister Narendra Modi) కలిసేందుకు శుక్రవారం మూడు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. పుతిన్ తో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ కు వచ్చింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ యుద్ధం(Ukraine War) ప్రారంభమైన తర్వాత, రష్యా వెలుపల జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న శనివారం నాటి రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం, ఆహారం, ఇంధనం, ఆరోగ్యం, విపత్తుల నివారణ, కీలక సరఫరా రంగాలలో సామూహిక స్థితిస్థాపకతను పెంపొందించడంపై దృష్టి సారించనుంది.
శుక్రవారం మధ్యాహ్నం భారత మండపంలో(Bharat Mandapam) బ్రిక్స్ సదస్సు జరగనుంది. సదస్సులో రష్యా, చైనా, బ్రెజిల్, సభ్య దేశాల అధినేతలు పాల్గొనున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ ఫోరం సదస్సు నిర్వహించింది. రేపు మధ్యాహ్నం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Chinese President Xi Jinping) ఢిల్లీ చేరుకుంటారు. దేశాధినేతలు, ఐరాస సహా అంతర్జాతీయ సంస్థల ముఖ్య అధికారులు భారత్ కు వస్తున్నారు. దీంతో విమానాశ్రయాల వద్ద అధికారులు భద్రత కట్టదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది భారత మండపాన్ని ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. అధ్యక్షులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల షెడ్యూల్ ను విదేశాంగశాఖ విడుదల చేసింది.