అజిత్ అగార్కర్ గుడ్ బై..! రేసులో ఇద్దరు స్టార్లు?
బీసీసీఐ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్గా అజిత్ అగార్కర్(Ajit Agarkar) స్థానంలో మాజీ భారత క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝాలు(Pragyan Ojha) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అగార్కర్ ఒప్పందం ఈ నెలతో ముగుస్తుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్ ఒప్పందాన్ని పొడిగిస్తారనే వదంతులు వచ్చాయి. అయితే, వర్గాల సమాచారం ప్రకారం, అగార్కర్ పదవీకాలం(Agarkar's tenure) దాదాపు ముగిసిపోయిందని బీసీసీఐలోని(Board of Control for Cricket in India) ఒక వర్గం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా అగార్కర్ భవిష్యత్తుపైనా, ఆయనకు ఒప్పంద పొడిగింపు లభిస్తుందా? లేదా అనే దానిపైనా ఊహాగానాలు పెరుగుతున్నాయి.
శుక్రవారం జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) నేపథ్యంలో, అగార్కర్కు పదవీకాలం పొడిగింపు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం, బుధవారం జరిగిన ఎంపిక సమావేశమే అగార్కర్ అధ్యక్షత వహించిన చివరి సమావేశం అయి ఉండవచ్చు. ఆ తర్వాత, వెస్టిండీస్తో జరగబోయే వైట్-బాల్ సిరీస్(White-ball series), ఇరానీ ట్రోఫీ కోసం భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో 'రెస్ట్ ఆఫ్ ఇండియా' (ROI) జట్టు ఎంపిక కమిటీకి కూడా అగార్కర్ నేతృత్వం వహించారు. BCCI ఎంపిక కమిటీ చైర్మన్గా ఆ మాజీ పేసర్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్(Parthiv Patel), మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ముందున్నారు.