గణపతి మండపాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
20-09-2026 | 07:55pm
కౌకుంట్ల : దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం పేరూరు, వెంకంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు గణపతి మండపాలను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.