మృతురాలి కుటుంబానికి పరామర్శ, ఆర్థిక సాయం
గణపురం సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): మండలంలోని కొండాపూర్ సర్పంచ్(Sarpanch) మద్దెల విజయ అశోక్ తల్లి మద్దెల సరోజన ఇటీవల మృతి చెందగా ఉమ్మడి కొండాపూర్ గ్రామపంచాయతీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రూ. 5 వేలు, పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ ఇంజపురి ప్రవీణ్ కుమార్ రూ 2 వేలు వారి కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు చాడ కృష్ణ స్వామి ముదిరాజ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాజీ ఉపసర్పంచ్ కొత్తపెళ్లి చిన్న కుమారస్వామి, మండల అధ్యక్షులు బాణాల చంద్రమౌళి శ్రీపెల్లి వెంకటేశ్వర్లు బాణాల వెంకటేశ్వర్లు పెద్దపల్లి వీరభద్ర చారి శ్రీ పెళ్లి కృష్ణమాచారి మియాపురం సాధానందం చారి విజయపురం వెంకటేశ్వర్ల చారి నాగవెల్లి సాంబమూర్తి కళాకారుడు కందుకూరి బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.