కల్లూరు మండల ఉపసర్పంచ్ ఫోరం నూతన కమిటీ నియామకం
16-09-2026 | 04:50pm
కల్లూరు,సెప్టెంబర్ 16(విజయక్రాంతి): కల్లూరు పట్టణంలో ఖమ్మం జిల్లా ఉపసర్పంచ్ ఫోరం(Deputy Sarpanch Forum)ఆధ్వర్యంలో కల్లూరు మండల ఉపసర్పంచ్ ఫోరం నూతన కమిటీని నియమించారు.జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు సుహాసిని సురేష్ ఆధ్వర్యంలో, జిల్లా ఫోరం బొట్ల కార్తీక్ ఆదేశాల మేరకు కమిటీని ప్రకటించారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా పైళ్ల రాధాకృష్ణ, ఉపాధ్యక్షురాలిగా పరిమి కృష్ణవేణి భరత్, జనరల్ సెక్రటరీగా నలజాల కిషోర్, సెక్రటరీగా తోటపల్లి చిన్నకాంతమ్మ విష్ణు, వర్కింగ్ ప్రెసిడెంట్గా రావి సూర్యనారాయణ నియమితులయ్యారు.