calender_icon.png 22 April, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జడ్పీ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

13-04-2025 08:19:23 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2000- 01 లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థిను ల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాల్య మిత్రులందరు పరస్పరం ఆలింగణం చేసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధురానుభూతులను నెమరు వేసుకున్నారు.ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాద్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం అనంతరం బాల్య మిత్రులు కలిసి చదువుకున్న పాఠశాల లో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం  జీవితంలో మరిచి పోలేనిదని  ఆన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాటి ఉపాద్యాయులు నాగేశ్వర్ గౌడ్, స్వామి, గురుప్రసాద్, రాజలింగు, రామస్వామి, రమాదేవి, జ్యోతి, విద్యార్థినులు పాల్గొన్నారు.