డీల్ విలువ రూ. 2,048 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: పేటీఎం తన ఎంటర్టైన్మెంట్, టిక్కెటింగ్ వ్యాపారం ఇన్సైడర్ను ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమోటోకు విక్రయిస్తున్నది. ఈ మేరకు బుధవారం పేటీఎం మాతృసంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. పూర్తిగా రూ. 2,048 నగదు లావాదేవీగా ఈ డివిజన్ చేతులు మారుతుందని సమాచారం.