న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం నిర్వహిస్తున్న జొమా టో కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసి కంలో 4 రెట్లకుపైగా పెరిగి రూ. 176 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.36 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ. 2,848 కోట్ల నుంచి రూ. 4,799 కోట్లకు పెరిగింది. మంగళవారం సమావేశమైన జొమాటో బోర్డు క్విప్ ఇష్యూ ద్వారా రూ. 8,500 కోట్లు సమీకరించే ప్రతిపాదనను ఆమోదించింది.