సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనంజయలతో దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జీబ్రా’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. గురువారం సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. సూర్య అనే శక్తివంతమైన పాత్రలో సత్యదేవ్ కనపడనున్నారు.
‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనే ఉప శీర్షికతో రానున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.