calender_icon.png 23 October, 2024 | 8:50 PM

ఫార్మాసిటీని రద్దు చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్

12-08-2024 01:19:32 PM

సంగారెడ్డి, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్ చేశారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలం కొత్తగా 20 ఎకరాలలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పేద రైతుల భూములను లాక్కున్నందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎం చైర్మన్ శివకుమార్ రైతులు పాల్గొన్నారు