న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ చెంగ్డూ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లాడు. టోర్నీలో మూడో సీడ్ అల్బా నో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో జతకట్టిన బాంబ్రీ శనివారం పురుషుల డబు ల్స్ క్వార్టర్స్లో 5-7, 6-3, 12-10 తో గొంజాలో-డీగో హిడాల్గొ (ఈక్వెడార్) జంటను ఓడించి సెమీఫైన ల్కు చేరుకుంది. సెమీస్లో ఈ జోడీ మాటోస్ (బ్రెజిల్)-డోడిగ్ (క్రొయేషియా) జంటను ఎదుర్కోనుంది. ఇక హాంగ్జౌ ఓపెన్ టోర్నీలో భారత డబుల్స్ ద్వయం విజయ్ సుందర్- జీవన్ జోడీ సెమీస్కు చేరుకుంది. డబుల్స్ క్వార్టర్స్లో విజయ్ జోడీ 6-7 (7/4), 7-6 (7/6), 10-8తో గ్లాస్పూల్- కాష్ (బ్రిటన్) జంటపై శ్రమించి నెగ్గింది.