హైదరాబాద్: తెలంగాణలో టీపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్, గాంధీభవన్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రజాభవన్లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం ప్రజాభవన్కు వెళ్లిన నేతలంతా.. అక్కడ వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిబిషన్ను చూస్తారు. అనంతరం గాంధీభవన్లో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. గాంధీభవన్లో రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు.