calender_icon.png 22 October, 2024 | 4:49 AM

గ్రూప్-1 అభ్యర్థులకు అండగా వైయస్ఆర్

21-10-2024 09:49:20 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): నిత్యం ప్రజా సేవే లక్ష్యంగా ఆపదలో ఉన్న అభాగ్యులకు నేనున్నాను. అంటు ముందుండే వైయస్ రెడ్డి ట్రస్టు చైర్మన్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గ్రూప్-1 మెయిన్స్ పరిక్షలు రాసే అభ్యర్థులకు భోజనం, వసతి కల్పించి మరోసారి తన సేవా తత్వాన్ని చాటుకున్నారు. జంట నగరాలతో పాటు నగర శివారులలో జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభం కావటంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వేలాది అభ్యర్థులు తరలివచ్చారు. వారికి భోజనం, వసతి సదుపాయాలు లేక పోవటం వల్ల ఇబ్బందులు పడుతారని గ్రహించిన సుదర్శన్ రెడ్డి ఘట్ కేసర్ తో పాటు నగరంలోని పలు చోట్లు అభ్యర్థులకు వసతి కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి సేవా తత్వాన్ని మరో సారి చాటుకున్నారు.

పరిక్షలకు ముందు ప్రభుత్వం ముందుగా ఏర్పాట్లు చేసి ప్రకటించాల్సి ఉందన్నారు. ప్రశాంత వాతావరణంలో పరిక్షలు రాసి ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతోనే తాను ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వైయస్ రెడ్డి తన వైయస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించి చదువులో కష్టం మీది, మీకు కావాల్సిన అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది అని చేస్తున్న సహాయం పట్ల ముగ్దులైన అభ్యర్థులు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాలలో వైయస్ రెడ్డి ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.