విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల జగన్, సుబ్బారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి.. సుబ్బారెడ్డి అన్నారు. సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని ఆరోపించారు. రేపు సాయిరెడ్డి కూడా సుబ్బారెడ్డి లాగే మట్లాడతారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డితో కొంచెమైనా నిజాయతీ ఉందేమో అనుకున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
విజయవాడలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి గురించి అమ్మకు తెలియాలనే వారి పేర్లు ప్రస్తావించానని చెప్పారు. అందరికీ సమాన వాటా ఉండాలని వైఎస్ అనుకున్నారు. నేను చెబుతున్నది నిజమని బిడ్డలపై ప్రమాణం చేస్తా.. నిన్న చెప్పిన విషయాలన్నీ నిజమని సుబ్బారెడ్డి ప్రమాణ చేయగలరా? అని ప్రశ్నించారు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు ఇవ్వాలని ఉందా అని సుబ్బారెడ్డి అన్నారు. ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలని సుబ్బారెడ్డి అన్నారు. ఆస్తులు భారతికి చెందినవైతే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా? అని ప్రశ్నించారు.