01-03-2025 12:07:52 AM
మఠంపల్లి ఫిబ్రవరి 28: మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి.బాబు సూచనలు మేరకు మఠంపల్లి మండలంలోని మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ కళా బృందం వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని, ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటీఎమ్ కార్డ్ వివరాలు, ఓటిపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కొరారు.
సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దని, వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని సూచించారు. మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దని, యువత చెడు వ్యసనాల బారిన పడొద్దని అన్నారు. గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దని అన్నారు. యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మఠంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.