07-03-2025 12:06:18 AM
సీఐ నందీశ్వర్ రెడ్డి
యాచారం మార్చి 6 : యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి గౌరెల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు ఆన్లైన్ గేమ్స్, పేకాట, చెడు వ్యసనాల, గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నందీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఆన్లైన్ గేమ్స్ వల్ల యువత సూసైడ్ చేసుకుంటున్నారని అలాంటి గేములకు ఎవరు అలవాటు పడవద్దు అని డ్రగ్స్ ఇతర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.
గ్రామంలోని వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలు వచ్చినా పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని తెలిపారు. యువతను చెడుదారి పట్టిస్తున్నాయని సైబర్ నేర్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో యాచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.