calender_icon.png 29 March, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిస కావొద్దు..

26-03-2025 06:02:29 PM

బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ..

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల యువత, విద్యార్థులు ఆన్ లైన్ అక్రమ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ అన్నారు. అక్రమ బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ కు పాల్పడి ఆన్లైన్ గేమ్స్ ఆడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న భ్రమలో యువత విద్యార్థులు బెట్టింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో దీని వ్యసనం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా పెట్టి తప్పుడు మార్గంలో పయనించకుండా జాగ్రత్త వహించాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలపై కోటి ఆశలతో రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నతమైన విద్యలు చదివించి ఉద్యోగాలలో స్థిరపడతారని ఆశతో ఉన్నారని అలాంటి గొప్ప తల్లిదండ్రుల ఆశలు నిరాశలు చేయవద్దని తెలిపారు. యువత పెడదారిని వదిలి సన్మార్గంలో నడిచి తల్లిదండ్రుల, పెద్దల గురువుల మాటలు విని ప్రయోజకులుగా ఎదగాలన్నారు. పిల్లలు ఉన్నత శిఖరాలలో కూర్చున్నప్పుడే తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా మనల్ని గౌరవిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రణయ్ బాలు సురేష్ తదితరులు పాల్గొన్నారు.