calender_icon.png 15 April, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలి

13-04-2025 05:31:04 PM

జాతీయ ఓబిసి కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలని జాతీయ ఓబీసీ చైర్మన్ హన్స్ రాజ్(National OBC Commission Chairman Hans Raj) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాండ్రే విశాల్ ఏర్పాటు చేసిన జిమ్ ను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక దృఢత్వం కోసం జిమ్ తప్పనిసరిగా చేయాలన్నారు. వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు.

యువత చెడు వ్యసనాల కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్ నార్ రమేష్, యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి , మాలి సంఘం రాష్ట్ర నాయకుడు శంకర్, తరుణ్, బిజెపి లీగల్ అడ్వైజర్ బోనగిరి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.