calender_icon.png 23 October, 2024 | 10:53 AM

యువత మత్తుకు దూరంగా ఉండాలి

29-07-2024 12:45:50 AM

ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి

మెదక్ ఎంపీ రఘునందర్‌రావు

సిద్దిపేటరూరల్, జూలై 28: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ ఎంపీ రఘునందర్ రావు అన్నారు. సిద్దిపేట పోలీస్‌శాఖ, రన్నర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్ వద్ద ఏర్పాటు చేసిన హాఫ్ మారథాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా 5కే, 10కే, 21కే రన్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యువ త ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్, వ్యాయామాల వంటివి అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని, వైద్యుల దగ్గరు వెళ్లాల్సిన అవసరం రాదని తెలిపారు. పోటీలో సుమారు 3 వేల మంది యువతీయువకులు పాల్గొనగా, విజేతలైన వారికి ఎంపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని పోటీలో పాల్గొన్న యువతకు అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్క లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మె ల్సీ కూర రఘోత్తంరెడ్డి, రన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.