సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : వ్యవసాయ బావి వద్ద మోటర్ స్టార్చేయబోయి విద్యుదాఘాతం కావడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన జహీరాబాద్ మండలం శేకపూర్ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. శేకపూర్ తండాకు చెందిన విశాల్ తన పొలంలో ఆదివారం వ్యవసాయ బోరు మోటర్ స్టార్ట్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ సమయంలో అతడి తండ్రి కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. అక్కడికక్కడే విశాల్ మృతిచెందాడు. హీరాబాద్ రూరల్ పోలీసుల మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.