calender_icon.png 30 September, 2024 | 2:54 AM

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

30-09-2024 12:00:00 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : వ్యవసాయ బావి వద్ద  మోటర్ స్టార్‌చేయబోయి విద్యుదాఘాతం కావడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన జహీరాబాద్ మండలం శేకపూర్ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. శేకపూర్ తండాకు చెందిన విశాల్ తన పొలంలో ఆదివారం వ్యవసాయ బోరు మోటర్ స్టార్ట్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ సమయంలో అతడి తండ్రి కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. అక్కడికక్కడే విశాల్ మృతిచెందాడు.  హీరాబాద్ రూరల్ పోలీసుల మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.