calender_icon.png 25 October, 2024 | 9:46 AM

మంథనిలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

09-08-2024 11:57:39 AM

యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేసిన శ్రీను బాబు 

మంథని(విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం మంథనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఇటీవల మే 30వ తేదీన జరిగిన మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన సోదరులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ... దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం పునాదిలాగా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేస్తున్న కృషి కారణమని, యువజన కాంగ్రెస్ పార్టీకి పునాది లాంటిదన్నారు. గత పది సంవత్సరాలు పార్టీ అధికారం లేకున్న పార్టీ  అభ్యున్నతి కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా కష్ట పడ్డారని, ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.