భద్రాచలం, సెప్టెంబర్ 19: ఉద్యో గం రావట్లేదన్న మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాహుల్రెడ్డి (23) బుధవారం పురుగులమందు తాగగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాహుల్రెడ్డి ఎంబీఏ రెం డో సంవత్సరం చదువుతున్నాడు. గత కొంత కాలంగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఎంత ప్రయత్నిం చినా ఉద్యోగం రాకపోవడంతో మ నస్థాపానికి గురయ్యాడు. బుధవా రం ఇంట్లో ఎవరు లేని సమయం లో పురుగుమందు తాగాడు. గమనించిన బంధువులు అతడిని భద్రా చలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. బూర్గంపాడు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.