నాగర్కర్నూల్, సెప్టెంబర్ 19 ( విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువ కుల బృందం గణేశ్ నిమజ్జనంలో వీరంగం సృష్టించింది. ప్రమాదకర రీతిలో పటాకులు పేల్చుతూ ప్రజలకు భయాందోళనకు గురిచేశారు. పటాకులు పేలు తున్నంత సేపు గ్రామస్థులు ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని గడిపారు. తాండూర్ మండలం సిర్సువాడకు చెందిన పలువురు యువకులు బు ధవారం రాత్రి వినాయక నిమజ్జనం లో పాల్గొన్నారు. తాగిన మైకంలో పటాకులను తలపై పెట్టుకుని హంగామా సృష్టించారు. పటాకులు పేలుతున్నంత సేపు వినాయక శోభాయాత్ర చూసేందుకు వచ్చిన గ్రామ స్థులంతా పరుగులు పెట్టారు. మరికొందరు యువకులు వీడియో తీయడంతో గురువారం వెలుగులో కి వచ్చింది. భక్తి శ్రద్దలతో నిర్వహించాల్సిన నిమజ్జన వేడుకను కొం దరు తప్ప తాగి చిందులు వేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.