జనం ఛీ కొట్టినా మారవా
కోరుకంటి చందర్పై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఫైర్
రామగుండం, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ‘ఖబడ్దార్ కోరుకంటి. నీ ఆర్ఎ ఫ్సీఎల్ కథ ముగిసిపోలేదు. మొన్నటి ఎన్నికల్లో జనం ఛీకొట్టినా ఇంకా మారవా?’ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికులను అవమానపరిచిన చందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల పేరుతో సంపాదిం చిందంతా బయటకు తీసి బాధితులకు పంచేవరకు నిద్రపోనని హెచ్చరించారు.
సింగరేణి కార్మికులు చందాలు వేసుకొని గెలిపిస్తే కోరుకం టి చందర్ వారికి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. సింగరేణి మెడికల్ కళాశాలకు రూ. 500 కోట్లు సింగరేణి కార్మికులు ఇస్తే.. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అందుకు కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలని స్పష్టంచేశారు. రామగుండం కమల్హాసన్గా పేరు ఎలా వచ్చిందో మర్చిపోయావా అంటూ ఎద్దేవా చేశారు.