calender_icon.png 21 October, 2024 | 2:56 PM

వృధా కాదు మీ మరణం... రేపటి సమాజ నిర్మాణం కోసం

21-10-2024 12:16:14 PM

మంథనిలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో  సీఐ రాజు, ఎస్ఐ రమేష్ సిబ్బంది 

మంథని (విజయక్రాంతి): వృధా కాదు మీ మరణం... రేపటి సమాజ శ్రేయస్సు కోసమని మంథని సిఐ రాజు, ఎస్సై రమేష్ అన్నారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి, అసువులు బాసిన పోలీసుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంథని పోలీస్ స్టేషన్ లో సోమవారం ఘనంగా  నిర్వహించారు. మంథని సీఐ రాజు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సిబ్బందితో కలిసి అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐ లు మాట్లాడుతూ.. వృత్తినే దైవంగా భావించే పోలీసులు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజల కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని, వారి ఆశయాలను తాము కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్  తో పాటు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.