calender_icon.png 24 October, 2024 | 2:03 AM

చంద్రబాబు, రేవంత్‌కు మద్దతే మీ ఎజెండా

29-07-2024 12:56:27 AM

షర్మిల వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాం తి): జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. చంద్రబా బు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించేవారికి మధ్య చాలా తేడా ఉంటుందని పేర్కొ న్నది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టింది. మీ మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప.. ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని షర్మిలపై వైసీపీ మండిపడింది. ప్రతిపక్షం లో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే చంద్రబాబుకు మద్దతు పలకడమే మీ ఎజెండా అని అర్థమవుతుందని విమర్శించింది.

దివంగత నేత వైఎస్సార్ విగ్ర హాలు కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా? అని ప్రశ్నించింది. పావురాలగుట్టలో పావుమైపోయాడని వైఎస్ స్మార కాన్ని అవహేళన చేసినవారితో మీరు కలి సి నడవడం లేదా? అని మండిపడింది. తెలంగాణలో పుట్టాను.. తెలంగాణలోనే ఉంటాను.. అంటూ మాటలు చెప్పి.. అక్క డ నుంచి పారిపోయి ఇక్కడికి రాలేదా? అని ప్రశ్నించింది. మీకన్నా పిరికివాళ్లు.. మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు.. మీకన్నా అహంకారులు.. మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అని నిలదీసింది. ఇంతకీ మీరు చేసిన పోస్టు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా? లేక పక్క రాష్ర్టం లో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా? అని నిలదీసింది.