calender_icon.png 13 October, 2024 | 10:47 PM

వ్యవసాయ బావిలో యువకుడు అదృశ్యం... హత్యనా ఆత్మహత్యనా

13-10-2024 08:23:10 PM

మానకొండూర్,(విజయక్రాంతి): దసరా పండగ పూట సరదాగా స్నేహితులతో వెళ్లిన యువకుడు ఆదివారం వ్యవసాయ బావిలో అదృశ్యమైన ఘటన మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన ఇల్లందు త్రినాథ్(19)తో కలిసి కొమ్మగళ్ళ కిరణ్, రుద్రారం, స్వస్తిక్, సందీప్ లతో కలిసి సరదాగా స్నేహితులతో శనివారం వెళ్లారు. కాగా రాత్రి వరకు ఇల్లందుల త్రినాథ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

త్రినాథ్ కుటుంబ సభ్యులు స్నేహితులకు ఫోన్ చేయగా తమ కుమారుడు గ్రామంలోని రైతు వ్యవసాయ బావిలో త్రినాథ్ పడిపోయాడని సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకున్న కుటుంబ సభ్యులు స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు ముగ్గురి స్నేహితులపైనే అనుమానం ఉందని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తండ్రి ఇల్లెందుల నాంపల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.