calender_icon.png 23 October, 2024 | 3:08 AM

ప్రేమ కత్తికి మరో యువతి బలి.. గచ్చిబౌలిలో ఘటన

29-08-2024 10:40:29 AM

బంగాల్‌ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్న కర్ణాటక బీదర్‌ వాసి రాకేశ్‌

గతంలో పనిచేసిన చోట యువతికి పరిచయమైన యువకుడు

ఏడాదిగా యువకుడికి దూరంగా ఉంటున్న యువతి

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి లో కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో గతరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ (25) నగరానికి వచ్చి గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండా సమీపంలో తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో బ్యూటీషియన్ గా పని చేస్తుంది. ఆమెకు గత కొంత కాలం క్రితం కర్ణాటకకు చెందిన రాకేష్ తో పరిచయం ఏర్పడింది. అయితే రాకేష్ తనను పెళ్లి చేసుకోవాలంటూ దీపన్ తమాంగ్ వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఆమె పెళ్లికి నిరాకరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్ ఆమెతో మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న రాకేష్ అక్కడే ఉన్న కూరగాయల కత్తితో యువతి పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి పక్కనే ఉన్న  దీపన తమాంగ్ స్నేహితులు ప్రయత్నించారు. రాకేష్ వారిపై కూడా దాడికి యత్నించాడు. ఈ దాడిలో దీపన తమాంగ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితులకు సైతం గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన రాకేష్ మెయినాబాద్ సమీపంలో కనకమామిడి వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కరెంట్ పోల్ ఎక్కడానికి ప్రయత్నించి విద్యుత్ షాక్ తో గాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే కనకమామిడి సమీపంలోని హస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.