calender_icon.png 25 September, 2024 | 2:06 PM

ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

29-08-2024 09:55:19 AM

హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి చెందింది. నిన్న రాత్రి గచ్చిబౌలి పరిధి గోపన్ పల్లి తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగాల్ యువతిని ప్రేమ పేరుతో కర్నాటక బీదర్ వాసి రాకేశ్ వేధిస్తున్నాడు. గోపన్  పల్లి తండాలో ఉంటూ నల్లగండ్లలో యువతి బ్యూటీషన్ గా పని చేస్తోంది. మాదాపూర్ లోని హాస్టల్ లో ఉంటున్న రాకేశ్ యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. గతంలో పనిచేసిన చోటు యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు.

అయితే యువతి ఏడాదిగా యువకుడికి దూరంగా ఉంటుంది. రాకేశ్ నిన్న రాత్రి గోపన్ పల్లి తండాలోని యువతి ఇంటికి వెళ్లాడు. యువతికి పెళ్లికి నిరాకరించడంతో రాకేశ్ కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు స్నేహితులపై దాడి చేశాడు. గాయపడిన ముగ్గురు స్నేహితులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి రాకేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కరెంట్ షాక్ తగిలి గాయపడిన రాకేశ్ ను కనకమామిడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.