పోలీసుల అదుపులో నిందితుడు
మంచిర్యాల, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా న స్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పీఎంపీ వైద్యం వికటించి యువతి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన చింతం శ్రీలత(24)కు రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థాని కంగా ఉండే ఓ పీఎంపీ వద్దకు వెళ్లా రు.
జ్వరం తీవ్రత గమనింకుండా పీసీఎం (పారాసిటమల్) ఇంజక్షన్ వేశాడు. అనంతరం మరో ఇంజక్షన్ వేయడంతో శ్రీలతకు చలితోపాటు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గమనించిన భర్త రాజు మంచిర్యాలలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్, హైదరాబాద్కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు.
ఆదివారం సాయంత్రం శ్రీలత మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పిన వెంటనే పీఎంపీ ప్రశాంత్తో పాటు ఆయనను తీసుకువచ్చిన మహాలక్ష్మీ మెడికల్ షాపు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.