భీమదేవరపల్లి, సెప్టెంబర్ 29: లోన్యాప్ వేధింపులకు యువకు డు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో చోటుచేసుకుంది. ముల్కనూర్కు చెందిన మాడ్గుల అనిల్ డిగ్రీ పూర్తి చేసి హ నుమకొండలో ఆరు నెలల క్రితం హోటల్ పెట్టాడు. వ్యాపారం సరిగ్గా నడువక ఇబ్బందులు ఎదుర్కొన్నా డు. గత నెల రోజుల క్రితం ముల్కనూర్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ ఏర్పా టు చేశాడు.
హోటల్ ఏర్పాటుకు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ కోసం 12 లోన్ యాప్ల ద్వారా సుమారు రూ.12 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. వ్యాపారం సరిగా నడవక తిరిగి చెల్లి ంచకపోవడంతో లోన్యాప్ల వా రు తరచూ ఫోన్ చేసి వేధింపులకు పాల్పడినట్టు ఆయన కుటుంబసభు ్యలు తెలిపారు. దీంతో శనివారం అ ర్ధరాత్రి అనిల్ పురుగుల మందు తా గాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రి లో చేర్పించినా పరిస్థితి విష మించి ఆదివారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.